Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
- నిర్లక్ష్యంపై పొంగులేటి సీరియస్
- తహసీల్దార్ సుజాతపై సస్పెన్షన్ వేటు
- రాయికల్ MROకు షోకాజ్ నోటీసు
- ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం.. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు
ప్రజా సమస్యల పరిష్కారంలో , అధికారుల పనితీరులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ సుజాతను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే సమీక్షా సమావేశంలో ప్రాజెక్టులపై సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాయికల్ ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణలో గతంలో జరిగిన అవకతవకలపై , విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఎలాంటి సిఫార్సులు చూడకుండా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Also Read
- Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి పథకాలపై కీలక ప్రకటనలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లిస్తుందని, ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేదని మంత్రి వెల్లడించారు. కాగితాలకే పరిమితం కాకుండా ఇప్పటికే రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను ప్రజలకు అందించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ధరణి నియామకాలతో ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించి, భూముల సమస్యలను సులభతరం చేసేందుకు ‘భూ భారతి’ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అయితే, గత పాలకులు భూ భారతిని కూడా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై ప్రత్యేక విచారణ కోసం ‘సిట్’ (SIT) ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!