Fair Accident: పాళికా బజార్ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరుకున్న తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fair Accident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లారు. పరిస్థితుల్ని ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. పక్కనే వున్న లాడ్డీలో వున్న వారందరిని సురక్షితంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారని అన్నారు. పాళికా బజార్లోని ఓ బట్టల షాపులో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. పాళికా బజారులో సుమారు నాలుగు వందల షాపుల ఉన్నాయి. అక్కడే వున్న ఓ బట్టల షాపులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. బట్టల దుకాణం పక్కనే ఉన్న లాడ్జ్ ఉండటంతో ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. మంటలు అంటుకున్న షాపుకు చుట్టుపక్కల్లో బట్టల హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి.
Read also: West Bengal: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రక్తపాతం.. 20కి చేరిన మరణాల సంఖ్య..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
పక్కనే వున్న మరొక బట్టల దుకాణంతోపాటు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లోకి మంటలు విస్తరించి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. మంటలను ఆర్పేందుకు రంగంలోకి నాలుగు ఫైర్ ఇంజన్లు దిగి మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న మరో రెండు షాపులోకి మంటలు వ్యాపించడంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడు కోవడానికి ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీసారు. స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఎలా చెలరేగాయి? షార్ట్ షర్య్కూట్ వల్ల మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Delhi: 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు.. అధికారులకు సెలవు రద్దు చేసిన సీఎం కేజ్రీవాల్..
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!