కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం జులైలో జరగాల్సిన ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. మినిమం పాస్ మార్కులు వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది అడ్మిషన్స్ , పరీక్ష ఫీజు చెల్లించిన వారి సంఖ్య పెరిగింది.
read also : తెలంగాణలో ఈ రోజు నుండి మోస్తరు వర్షాలు…
తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ ఏడాది ఫీజు చెల్లించిన వారందరూ పాస్ అయ్యారు. 63 వేల 581 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు ఫీజు చెల్లించగా… ఇంటర్ పరీక్ష కోసం 47 వేల 392మంది విద్యార్థులు ఫీ చెల్లించారు. ఫీజు కట్టిన మొత్తం లక్షా 10 వేల 9 వందల 73 మంది విద్యార్థులు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉత్తీర్ణులు అయ్యారు. ఇంప్రూవ్ మెంట్ రాసుకునే విద్యార్థు లకు పరిస్థితిలు చక్కబడ్డాక అవకాశం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.