Harish Rao: డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు. పేదలకు ఎలాంటి లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని గుర్తు చేశారు. ఈ నెలలో 2000 పల్లె దవాఖానలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు హరీశ్ రావు. తెలంగాణ వచ్చిన నాడు 5 మెడికల్ కాలేజ్ లు ఉంటే, ఇప్పుడు 17 కు పెరిగాయని గుర్తు చేశారు. కరోనా తర్వాత వేయిటేజే ఇస్తున్నామని, ఒక ఏడాదికి 2 మార్కులు కలుపుతున్నామని తెలిపారు. మొదటి ఎ.ఎన్.ఎం. ఖాళీలు ఉన్నాయని, నెలా రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని శుభవార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు.
Read also: Rajamouli, Mahesh Movie Update: మహేశ్తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
బ్యాంకులో లోన్లు తీసుకుని చాలాకాలంగా కట్టని రైతుల కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని ఇస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. నిన్న (శనివారం) ఆయన సిద్దిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లాకె చెందిన ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. దీని వల్ల జిల్లాలోని 12 వేల మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. జిల్లా బ్యాంకర్లతో మాట్లాడగా.. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ వన్ టైమ్ సెటిల్మెంట్ కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు. పాత, మొండి బకాయిలున్న రైతులు సెటిల్మెంట్ చేసుకోవాలని, దీనివల్ల కొత్తగా లోన్లు తీసుకునే చాన్సు ఉంటుందన్నారు. మొండి బకాయిల లిస్ట్ లను ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీపీలు, అధికారులకు త్వరలోనే అందజేయనున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..