డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం చేసినట్లు తెలుస్తోంది.
ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గజేంద్ర ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గజేంద్ర ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ డ్రగ్స్ కేసులో గజేంద్ర నిందితుడుగా ఉండడంతో.. గజేంద్రను పట్టుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పీటీ వారెంట్ వేసి గజేంద్రను హైదరాబాద్ కు పోలీసులు తీసుకొని రానున్నారు. గజేంద్రతో పాటు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు.