గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి యావత్త ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. అయితే ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించిన థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే భారతదేశం బయటపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో భౌతిక విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓమిక్రాన్ సైలంట్ కిల్లర్ అని ఎన్వీ రమణ అన్నారు.
మెదటి వేవ్ లో కరోనా వచ్చినప్పటికి కేవలం నాలుగు రోజుల్లో కోలుకున్నానని, కానీ ఓమిక్రాన్ సోకటం వల్ల నేను గత 25 రోజుల నుంచి భాదపడుతున్నానని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇంకా కేసుల సంఖ్య తగ్గలేదు రోజుకి 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎప్పుడు భౌతికంగా కేసులు విచారణ చేపట్టాలో మేము చెప్తామని ఆయన తెలిపారు. జనవరిలో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరినప్పుడు 10 మందికి పైగా సుప్రీంకోర్టు జడ్డిలకు కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు.