Paddy Purchase: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోళ్ళు శూన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 14 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ఇందుకు గానూ ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం తో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటన వచ్చి వారం రోజులు అయినా ఉమ్మడి జిల్లాలో సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెంటర్లు ప్రారంభమైనా యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటివరకు ధాన్యం కొనలేదు. రిబ్బన్ కట్ చేసి సెంటర్లను ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత కొనుగోళ్లు సాగుతున్నాయా లేదా? అని పట్టించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రా లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా లక్ష ఆరువేలమంది రైతులు 1 లక్ష 65 వేల 352 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 3 లక్షల 55 వేల 770 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 280 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 34 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ధాన్యం కొనలేదు. కొనుగోళ్లు జరిగేందుకు ఇంక వారం పట్టే అవకాశం ఉంది.గన్నీ బ్యాగుల కొరత,ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు వడ్లను తరలించాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వెహికిల్స్ కేటాయించక పోవడంతో ధాన్యం కొనుగోలు లో జాప్యం జరుగుతోంది.
ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!