Paddy Purchase: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోళ్ళు శూన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 14 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ఇందుకు గానూ ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం తో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటన వచ్చి వారం రోజులు అయినా ఉమ్మడి జిల్లాలో సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.
Also Read
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెంటర్లు ప్రారంభమైనా యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటివరకు ధాన్యం కొనలేదు. రిబ్బన్ కట్ చేసి సెంటర్లను ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత కొనుగోళ్లు సాగుతున్నాయా లేదా? అని పట్టించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రా లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా లక్ష ఆరువేలమంది రైతులు 1 లక్ష 65 వేల 352 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 3 లక్షల 55 వేల 770 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 280 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 34 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ధాన్యం కొనలేదు. కొనుగోళ్లు జరిగేందుకు ఇంక వారం పట్టే అవకాశం ఉంది.గన్నీ బ్యాగుల కొరత,ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు వడ్లను తరలించాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వెహికిల్స్ కేటాయించక పోవడంతో ధాన్యం కొనుగోలు లో జాప్యం జరుగుతోంది.
ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు
తాజావార్తలు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?