Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్పై మంత్రి సీతక్క ఆగ్రహం..
- నిర్మల్ జిల్లా కలెక్టర్పై మంత్రి సీతక్క ఆగ్రహం..
- నాయక్ పోడులు అంటే కలెక్టర్కు తెలియకపోవడం బాధాకరం..
- అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం: మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది. ఏ కులం వారికి ఏ ఏ రిజర్వేషన్లు, ఏం హక్కులు ఉన్నాయే తెలుసుకోని వాటిని అమలు చేయాలని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్య ఎక్కడెక్కడా ఉందో నా దృష్టికి తీసుకురండీ.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికెట్ల సమస్య పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు పంపిస్తామని మంత్రి సీతక్క వెల్లడించింది.
Read Also: Rain Alert In TG: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే నాలుగు రోజుల పాటు వానలే వానలు..
Also Read
అయితే, నాయక్ పోడ్ వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పేదల పక్షాన ఈ ప్రభుత్వం నిలపడుతుంది.. పోడు భూముల సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి.. నెరవేరే విధంగా చూస్తాను అని తెలిపింది. ఇందిరమ్మ ఇండ్లలో ప్రత్యేకంగా కొన్ని ఇళ్లు నాయక్ పోడ్లకు అందించేలా మంత్రితో మాట్లాడతాను అని పేర్కొనింది. అలాగే, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కుల ధ్రువీకరణ పత్రం వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చింది.
Read Also: Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్డేట్కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
ఇక, ఆదివాసీల త్యాగాలు ఎక్కువ.. ఫలాలు తక్కువ అని మంత్రి సీతక్క తెలిపింది. గిరిజన ప్రాంతాలలో నీరు ఉన్నా.. కానీ, ఆదివాసీలకు ప్రయోజనం లేదు అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదివాసీల ఉన్నారు.. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు ఏర్పాటు చేయలేక పోతున్నారు.. జాతి, కులగణన లేనప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించడం సాధ్యం కాదని వెల్లడించింది. ఆందరి కులాల దేవుళ్లను గౌరవిద్దాం.. అంతిమంగా మన జాతికి ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలను కాపాడుకుందాం.. జాతి గుర్తింపు ఉండాలంటే వేషధారణ ముఖ్యం అని సూచించింది. ములుగు లాంటి ప్రాంతాలలో కాకతీయుల కాలంలో భాష మారింది అని సీతక్క చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!