Niranjan reddy: ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టులన్నీ నిజాంసాగర్ నిర్మించిన తర్వాతవే అని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఆధునిక ప్రాజెక్టులకు భిన్నంగా పారే నీళ్లు ఎదురెక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని వెల్లడించారు. సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చి తెలంగాణలో సాగుకు అనుకూలమైన భూమిని సేద్యంలోకి తీసుకువచ్చామని అన్నారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుకు బీమా అందించే ఏకైక సీఎం కేసీఆరే అని.. రైతుకు రైతుబంధు ద్వారా ఎదురుపెట్టుబడి ఇస్తున్నది కేసీఆర్ అని నిరంజర్ రెడ్డి అన్నారు. ఏది పండించాలి ? ఏది పండించకూడదు ? అని తెలుసుకుని సాగు చేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందని… 5 శాతం మాత్రమే జీవరాశి జీవించగలిగే ఈజిప్ట్ లో కోటి ఎకరాలలో భూమి మాత్రమే సాగవుతుందని.. అక్కడి ప్రభుత్వం ఏ పంటలు పండించాలో రైతులకు నిర్ధేశిస్తుందని.. రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేస్తారని వెల్లడించారు. మొన్నటి వరకు ఇతర దేశాలపై ఆధారపడిన ఈజిప్టు ఇప్పుడు యూరప్ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని చెప్పుకొచ్చారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం గోధుమ ఎగుమతులను నిషేధించడం గమనార్హం అని అన్నారు.
Also Read
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపాన్ని సంపూర్ణంగా మారిస్తే .. తెలంగాణ నుండి వస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రకటించడాన్ని రైతులు గమనించాలని ఆయన కోరాడు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2008 నుండి కొట్లాడుతున్నాం .. దీనిపై మాట్లాడిన తొలి ఎంపీ వినోద్ కుమార్ అని గుర్తు చేశారు. దీనిపై మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2014 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మాటతప్పారని విమర్శించారు. తమ పాలిత రాష్ట్రాల్లో చేయ చేతగాని కాంగ్రెస్ తెలంగాణలో డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులు అమాయకులని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయని.. చాంధసవాద దేశాలు అనుకున్న ప్రాంతాలు మహిళల భాగస్వామ్యంతో పురోగమిస్తున్నాయని, మన దేశాన్ని మాత్రం తిరోగమనం వైపు నడిపిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!