YS Sharmila : కేసీఆర్ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని అన్నారు.
సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో 5 రోజుల నుంచి పండించిన పంటను కుప్పలు వేసుకొని రైతులు అక్కడే ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు మద్దతు ధర రావటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లోకి తెచ్చిన పంటని వెనక్కి తీసుకువెళ్లలేక రైతులు అగచాట్లు వర్ణణాతీతమని అన్నారు. కేవలం 1500 రూపాయలకు పంటను అమ్ముకునే దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు.
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
మద్దతు ధర 1960 రూపాయలు అయితే.. ఒకరో, ఇద్దరికో ఆధర వేసి తూతూ మంత్రంగా కానిస్తున్నారని మండిపడ్డారు. 70 శాతం మందికి మద్దతు ధర రావటం లేదని షర్మిల అన్నారు. మెదక్ మార్కెట్ యార్డ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా వుందని, అక్కడి రైతులు 20 రోజులుగా కుప్పలు వేసుకుని, ఇంటికి దూరంగా వున్నారని ఆమె అన్నారు. సీఎం కెసిఆర్ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని షర్మిల మండిపడ్డారు. నీ మాట నమ్మి వరి వేసుకోకుండా ఉన్నందుకు వారికి సీఎం పార్టీ అకౌంట్ లో ఉన్న 850 కోట్లు నుంచి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కాదు.. రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు. 24గంటల కరెంట్ ఇస్తామన్నారు.. కానీ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రావలని షర్మిల అన్నారు.
Nagaraju Murder: నాగరాజు హత్యలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు
తాజావార్తలు
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!