Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: జమ్ముకశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read also: Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పబ్బల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో చేరాడు. దాదాపు 11 ఏళ్లుగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం CFN AVN టెక్నీషియన్గా పని చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌజన్యతో వివాహమైంది. ఈ దంపతులకు అయాన్ మరియు ఆరవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ నెల రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చి రెండో కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. తన అత్తగారి గ్రామంలో ఏర్పాటు చేసిన బీరప్ప ఉత్సవానికి కూడా వెళ్లాడు. పది రోజుల కిందటే గ్రామం వదిలి మళ్లీ డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా గురువారం ఆయన హెలికాప్టర్లో ప్రయాణించారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అతడు చనిపోయాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేసింది. శుక్రవారం సాయంత్రం అనిల్ మృతదేహం మల్కాపూర్ గ్రామానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతికి తెలంగాణ ప్రణాళికా సంఘం కుమారుడు బోయినపల్లి వినోద్ సంతాపం తెలిపారు. అనిల్ మృతి బాధాకరమన్నారు. అనిల్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Siddipet Crime: కొడుకులు పంచుకున్నారు.. భరించలేక తన చితికి తానే నిప్పంటించుకున్న తండ్రి
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లా మార్వా తహసీల్లోని మచ్నా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బళ్ల అనిల్ (29) సిరిసిల్ల జిల్లా వాసి. ఈ విషయం తెలియడంతో జిల్లా మొత్తం విషాదంలో మునిగిపోయింది.
KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాజావార్తలు
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!