Secunderabad: సికింద్రాబాద్ చోరీ కేసును చేధించిన పోలీసులు.. 9 మంది నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఈ నెల 9న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేందించారు. ఒక వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల సొత్తు చోరీ.. ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. వ్యాపారి అపార్ట్మెంట్లో గత ఐదేళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన శంకర్ మాన్ సింగ్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని చెప్పాడు. 41 లక్షల నగదు, 2.8 కిలోల బంగారం, 18 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 13 మంది నిందితుల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించారు.
Read also: Talasani Srinivas Yadav: బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము
Also Read
వ్యాపారవేత్త రాహుల్ గోయల్, అతని ముగ్గురు సోదరులు సికింద్రాబాద్లోని పీజీ రోడ్డు సింధీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈ సోదరులు ఇనుము వ్యాపారం చేస్తున్నారు. నేపాల్కు చెందిన కమల్ గత ఐదేళ్లుగా వారి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని రాహుల్ కుటుంబం ఈ నెల 9న హైదరాబాద్ నగర శివార్లలోని తమ ఫామ్ హౌస్ కు వెళ్లింది. రాహుల్ మరుసటి రోజు అంటే జూలై 10 సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాడు. అక్కడ వాచ్మెన్ కమల్ కూడా కనిపించలేదు.
Read also: Pawan Kalyan: కేంద్ర మంత్రి మురళీధరన్ ఇంటికి పవన్ కళ్యాణ్
దీంతో గోయల్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దోపిడీ జరిగిన ఇంటిని పరిశీలించారు. గోయల్ కుటుంబానికి వాచ్మెన్ కమల్ సన్నిహితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నందున వాచ్మెన్పై గోయల్కు పూర్తి నమ్మకం ఉంది. అయితే బోనాల సందర్భంగా బయటకు వెళ్తున్నారని పసిగట్టిన కమల్.. దొంగతనాలకు పాల్పడే నేపాల్ గ్యాంగ్ కు సమాచారం అందించాడు. రెండు కార్లలో వచ్చిన నిందితులు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు, వాచీలు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దోపిడీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాలీ ముఠా పారిపోయింది. పోలీసులు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి నేపాల్ సరిహద్దు దాటకముందే అరెస్ట్ చేశారు.
Hijras: ఛీ ఛీ.. హిజ్రాకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!