Nayini Rajender: మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం ఘట్కేసర్లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. ఆయనకు తగిన శాస్తే జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డదిడ్డంగా మాట్లాడినందుకే ప్రజలు వ్యతిరేక నినాదాలు చేశారని, ఆయన కాన్వాయ్పై దాడి చేశారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూముల్ని రాజ్యాంగబద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
భూములు ఇవ్వడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదని, సాయంత్రంలోపు ల్యాండ్ పూలింగ్ జీవో వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని రాజేందర్ రెడ్డి అన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు కాదని.. ల్యాండ్ బ్రోకర్లని విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తే.. మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ నాయిని నిలదీశారు. కాగా.. రెడ్ల సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభికుల నుంచి వ్యతిరేక నినాదాలు రేకెత్తాయి. దీంతో ఆయన ప్రసంగం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆయన కాన్వాయ్పై రాళ్ళు, కుర్చీలు, సీసాలతో దాడి చేశారు. పోలీసులు ఎంతో అప్రమత్తంతో మంత్రి వాహనాల్ని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేశారు.
Also Read
అటు, ఈ ఘటనపై స్పందిస్తూ తనను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారంటూ మల్లారెడ్డి ఆరోపించారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామని అన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను ఆ సభలో వివరించానని మల్లారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!