డ్రగ్స్ కేసు… కెల్విన్కు నాంపల్లి కోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న కెల్విన్కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్ను 2016లో బోయిన్పల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్డీ రకం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం.. సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్పై బయటకు వచ్చేశాడు.. ఇక, మళ్లీ 2016లోనే ఎక్సైజ్ పోలీసులు కెల్విన్ను మరోసారి అరెస్ట్ చేశారు.. ఈ విచారణ సమయంలోనే తీగ లాగితే డొంక కదిలినట్టు.. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవమారం బయటపడింది.. సినీ ప్రముఖుల పేర్లను తెరపైకి తెచ్చింది. అయితే బోయిన్పల్లి కేసులో సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం.. ఆ ఛార్జ్సీట్ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించడం జరిగిపోయాయి.. దీంతో.. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్కు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.
మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ను ప్రశ్నించగా.. ఇవాళ నందును కూడా విచారణకు పిలిచింది.. ఇదే సమయంలో.. కెల్విన్ను కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు.. 8 గంటలకు పైగా కెల్విన్ను ప్రశ్నిస్తున్నారు.. విచారణలో కెల్విన్ నుంచి కీలకమైన అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది.. టాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా వ్యవహారం.. కెల్విన్ బ్యాంకు అకౌంట్ కు పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపుపై ప్రశ్నిస్తున్నారు.. కెల్విన్ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినట్లుగా గుర్తించిన ఈడీ.. 30 అకౌంట్ల ద్వారా కెల్విన్ బ్యాంక్ ఖాతాలోకి నిధులు వచ్చినట్టుగా చెబుతున్నారు.. కెల్విన్ ఇంటి నుంచి రెండు ల్యాప్టాప్లు, సెల్ఫోన్టు కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు.. కెల్విన్ కు రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో కెల్విన్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!