Nama Nageswara Rao: బీఆర్ఎస్ దేశ భవిష్యత్ను మార్చబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nama Nageswara Rao Says BRS Party Will Change India Future: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ భవిష్యత్ను మార్చోబోతోందని ఆ పార్టీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు.. దేశ రాజకీయ చరిత్రలో నవ శకానికి నాంది అని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని.. దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించబడిందని తెలిపారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుందని చెప్పారు. దేశ ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ నేతృత్వంలో తాము అవిశ్రాంత పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ మోడల్ను దేశానికి డిక్చూచిగా చేయనున్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవమని నామ నాగేశ్వర రావు తెలిపారు. బీఆర్ఎస్ జల సమస్యలపై ఫోకస్ పెట్టిందని చెప్పిన ఆయన.. విజయదశమి నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పార్టీ దేశంలో విజయ దుందుభి మోగిస్తుందన్నారు. ఇది దేశ భవిష్యత్తునే మార్చబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ సాధించిన తర్వాత.. రైతు బీమా, రైతు బంధు, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర పథకాలతో సీఎం కేసీఆర్ సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదంతో తామంతా ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ముందుకు వెళ్తామని నామ నాగేశ్వర రావు వెల్లడించారు.
Also Read
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
కాగా.. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్, దానికి ఆమోదం పొందేలా చేశారు. దీంతో.. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించగా.. చప్పట్లు, నినాదాలతో సమావేశం మార్మోగిపోయింది. దేశ్కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!