Nama Nageswara Rao: రైల్వే మంత్రితో ఎంపీ నామ భేటీ.. ఆ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి
Nama Nageswara Rao Met Railway Minister Ashwini Vaishnav In Delhi: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఖమ్మం జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి నామా తీసికెళ్లారు. ప్రధానంగా.. ప్రతిపాదిత ‘డోర్నకల్ – మిర్యాలగూడ’ రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చాలని కోరారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అందుకు పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోకపోతే.. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలామంది రైతులు తమ భూములు కోల్పోతారని మంత్రికి నామా వివరించారు.
Vinayakan: అసలు సీఎం ఎవరు.. అతను మంచి వ్యక్తి అని ఎవరు చెప్పారు.. ?
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
నాలుగు హైవేలు, నాగార్జున సాగర్ కాలువ కింద.. ఇప్పటికే ఆ మండలాల్లో చాలామంది రైతులు వందలాది ఎకరాల వ్యవసాయ భూముల కోల్పోయారని తెలిపారు. ప్రతిపాదిత రైలు వల్ల జిల్లాకు ఒనగూడే ప్రయోజనం లేదని తెలియజేశారు. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల్లో రైల్వే లైన్ కింద పోయే వ్యవసాయ భూములు ఎంతో విలువైనవని చెప్పారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నామ నాగేశ్వరరావు వినిపించిన వినతులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిసింది.
Yamuna River: యమునా మళ్లీ ఉగ్రరూపం.. మరోసారి ప్రమాదస్థాయిని దాటి..
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!