Yamuna River: యమునా మళ్లీ ఉగ్రరూపం.. మరోసారి ప్రమాదస్థాయిని దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamuna River: ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ఉద్ధృతి పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకుందని, రాత్రి 11 గంటలకు 205.45 మీటర్లకు చేరుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) గణాంకాలు చెబుతున్నాయి.
ఎగువ పరివాహక ప్రాంతాలు, ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వర్షాల కారణంగా గత రెండు-మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నాయి. జులై 13న యమునానది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 208.66 మీటర్లకు చేరిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎనిమిది రోజులుగా ప్రవహిస్తున్న నీటిమట్టం మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి ప్రమాద స్థాయి కంటే దిగువకు పడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 205.22 మీటర్లకు దిగజారి, మళ్లీ పెరగడం ప్రారంభించి ప్రమాదకర మార్కును అధిగమించింది.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
Also Read: TS Rains: ఇప్పుడే వదిలేలా లేవు.. మరో మూడు రోజుల భారీ వర్షాలు
జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీకి ఎగువన భారీ వర్షాలు కురిస్తే, నీటి మట్టం పెరగడం వల్ల రాజధానిలోని లోతట్టు ప్రాంతాలలోని బాధిత కుటుంబాల పునరావాసం మందగించవచ్చు. వారు ఎక్కువ కాలం సహాయక శిబిరాల్లో ఉండాల్సి రావచ్చు. ఇది నగరంలో నీటి సరఫరాపై కూడా ప్రభావం చూపుతుంది, ఇది వజీరాబాద్ వద్ద ఉన్న పంప్ హౌస్ ముంపు కారణంగా నాలుగైదు రోజుల పాటు ప్రభావితమైన తర్వాత మంగళవారం మాత్రమే సాధారణమైంది. పంప్ హౌస్ వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇవి నగర సరఫరాలో దాదాపు 25 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఢిల్లీ జల్ బోర్డు (DJB) అధికారుల ప్రకారం, పల్లా వద్ద వరద మైదానంలో కొన్ని గొట్టపు బావులు మునిగిపోవడంతో రోజుకు 10-12 మిలియన్ గ్యాలన్ల నీటి (MGD) కొరత ఉంది.
ఢిల్లీ జల్ బోర్డు పల్లా వరద మైదానంలో ఏర్పాటు చేసిన గొట్టపు బావుల నుండి దాదాపు 30 మిలియన్ గ్లాలన్ల నీటిని సంగ్రహిస్తుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు దాదాపు వారం రోజులుగా వరదలతో అల్లాడిపోతున్నాయి. ప్రారంభంలో జులై 8, 9 తేదీల్లో కురిసిన వర్షాల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది, కేవలం రెండు రోజుల్లోనే నగరం నెలవారీ వర్షపాతం కోటాలో 125 శాతం పొందింది. తదనంతరం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా యమునా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. జులై 13న 208.66 మీటర్ల వద్ద, యమునా దాని మునుపటి రికార్డు 207.49 మీటర్ల రికార్డును అధిగమించింది. 1978 సెప్టెంబర్లో ఈ రికార్డు సృష్టించగా.. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ రికార్డును అధిగమించింది.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!