Yamuna River: యమునా మళ్లీ ఉగ్రరూపం.. మరోసారి ప్రమాదస్థాయిని దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamuna River: ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ఉద్ధృతి పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 205.34 మీటర్లకు చేరుకుందని, రాత్రి 11 గంటలకు 205.45 మీటర్లకు చేరుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) గణాంకాలు చెబుతున్నాయి.
ఎగువ పరివాహక ప్రాంతాలు, ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వర్షాల కారణంగా గత రెండు-మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నాయి. జులై 13న యమునానది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 208.66 మీటర్లకు చేరిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎనిమిది రోజులుగా ప్రవహిస్తున్న నీటిమట్టం మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి ప్రమాద స్థాయి కంటే దిగువకు పడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 205.22 మీటర్లకు దిగజారి, మళ్లీ పెరగడం ప్రారంభించి ప్రమాదకర మార్కును అధిగమించింది.
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
Also Read: TS Rains: ఇప్పుడే వదిలేలా లేవు.. మరో మూడు రోజుల భారీ వర్షాలు
జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీకి ఎగువన భారీ వర్షాలు కురిస్తే, నీటి మట్టం పెరగడం వల్ల రాజధానిలోని లోతట్టు ప్రాంతాలలోని బాధిత కుటుంబాల పునరావాసం మందగించవచ్చు. వారు ఎక్కువ కాలం సహాయక శిబిరాల్లో ఉండాల్సి రావచ్చు. ఇది నగరంలో నీటి సరఫరాపై కూడా ప్రభావం చూపుతుంది, ఇది వజీరాబాద్ వద్ద ఉన్న పంప్ హౌస్ ముంపు కారణంగా నాలుగైదు రోజుల పాటు ప్రభావితమైన తర్వాత మంగళవారం మాత్రమే సాధారణమైంది. పంప్ హౌస్ వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇవి నగర సరఫరాలో దాదాపు 25 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఢిల్లీ జల్ బోర్డు (DJB) అధికారుల ప్రకారం, పల్లా వద్ద వరద మైదానంలో కొన్ని గొట్టపు బావులు మునిగిపోవడంతో రోజుకు 10-12 మిలియన్ గ్యాలన్ల నీటి (MGD) కొరత ఉంది.
ఢిల్లీ జల్ బోర్డు పల్లా వరద మైదానంలో ఏర్పాటు చేసిన గొట్టపు బావుల నుండి దాదాపు 30 మిలియన్ గ్లాలన్ల నీటిని సంగ్రహిస్తుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు దాదాపు వారం రోజులుగా వరదలతో అల్లాడిపోతున్నాయి. ప్రారంభంలో జులై 8, 9 తేదీల్లో కురిసిన వర్షాల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది, కేవలం రెండు రోజుల్లోనే నగరం నెలవారీ వర్షపాతం కోటాలో 125 శాతం పొందింది. తదనంతరం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా యమునా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. జులై 13న 208.66 మీటర్ల వద్ద, యమునా దాని మునుపటి రికార్డు 207.49 మీటర్ల రికార్డును అధిగమించింది. 1978 సెప్టెంబర్లో ఈ రికార్డు సృష్టించగా.. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ రికార్డును అధిగమించింది.
తాజావార్తలు
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..