Indrasena Reddy: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallu Indrasena Reddy Comments On Early elections:తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తోె పాటు కాంగ్రెస్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే విధంగా బీజేపీ కూడా ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మనుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరికొంత మంది నేతలు కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. మరో వైపు టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచనలో ఉన్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు మిగలరని ఆయన అన్నారు. మునుగోడు ఎన్నికలను ఫేస్ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరని మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ తరుపున టికెట్లు అడిగే వారు కూడా ఉందరనే భయం ఆ పార్టీకి పట్టుకుందని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఈ మోసపూరిత, అబద్దాల టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సుష్మా స్వరాజ్ చిత్రపటానికి ఇంద్ర సేనా రెడ్డి, తుల ఉమ, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఉద్యమ ఆంకాక్షలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. శ్మశాన వాటికలకు ఎక్కడైనా జీఎస్టీ వేశారా.. వేస్తామని చెప్పారా.. అని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.