BRS MLA’s Press Meet : కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ( శుక్రవారం ) నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించింది. సభలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ సర్కార్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి వారిపై విమర్శలు గుప్పించారు.
Also Read : Rinku Singh: రింకూ తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
కాంగ్రెస్ నేతల విమర్శలకు మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నల్గొండ కాంగ్రెస్ నేతలు సన్నాసులు… చవటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి ఉప ఎన్నికల్లో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేశారు అంటూ తెలిపారు. కాంగ్రెస్ లో అందరూ సీఎంలే.. ఒక్కరూ కూడా ప్రజల్లో గెలవరు అంటూ వెల్లడించారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ లు వేల ఎకరాల భూమితో పుట్టినరా అంటూ మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read : Anni Manchi Sakunamule: యాక్షన్ మూవీ చేయాలని ఉంది: మాళవిక నాయర్
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు జోకర్లుగా మారారు అంటూ BRS MLA సైదిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ లు కూడా రావంటు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు సభ్యత, సంస్కారం లేదని సైదిరెడ్డి అన్నారు. వాళ్ళను ఓడించడానికి మేము అవసరం లేదు.. వాళ్ళే ఒడించుకుంటారు అని హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాంగ్రెస్ నేతలకు.. వాళ్లు కావాలని ఇల్లు కట్టుకోలేదు అని ఆయన ఆరోపించారు.
Also Read : MLA Bhupal Reddy : బస్తీమే సవాల్ కోమటిరెడ్డి.. బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..
రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్గొండ ప్రజలు నాలుక కోస్తారు అంటూ తుంగతుర్తి MLA గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేవంత్, ఉత్తమ్ పై విమర్శలు చేశారు అని గాదరి కిషోర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా అంటే పారిపోయిన దొంగ జానారెడ్డి అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ నేతలది సొంత ఎజెండా.. BRS పార్టీది ప్రజల ఎజెండా అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!