Municipal Elections : మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష
- ముఖ్యనేతలతో జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం
- ఎన్నికల్లో సమిష్టిగా పని చేయాలని పిలుపు
- చైర్మన్, మేయర్ అభ్యర్థుల ప్రకటనపై వ్యూహాత్మక నిర్ణయం
- స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జూమ్ మీటింగ్ లో పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర కీలక నేతలతో చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీలోని నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
KCR vs SIT: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద హడావుడి.. సిట్ నోటీసుల హాజరుపై సస్పెన్స్!
Also Read
చైర్మన్ , మేయర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ , మేయర్ అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించవద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఖరారు చేయడం వల్ల పార్టీలో అసంతృప్తిని తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తన పాలనకు ప్రజా మద్దతు ఉందని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక కసరత్తు , ప్రచార సరళిపై విస్తృతంగా చర్చించారు.
Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?