Inspiration: ఆదర్శంగా నిలుస్తున్న ముచ్చర్ల గ్రామం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inspiration in Eye Donation: తెలంగాణలో అదో చిన్న విలీన గ్రామం. హన్మకొండ జిల్లాలోని హసంపర్తి మండలంలో మారుమూలన ఉంది. అయితేనేం ఆ ఊరి ప్రజల మనసు మాత్రం ఎంతో విశాలం. గ్రామంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు మృతుల కళ్ళను దానం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే గ్రామంలో 52 మందికి పైగా నేత్రాలను దానం చేశారు. ఎంతోమంది జీవితాల్లో ముచ్చర్ల గ్రామం వెలుగులు నింపుతోంది. ముచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్ మండల రవీందర్ మొదటి నుండి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి. 2013లో తన తల్లి లక్ష్మి మృతి చెందడంతో ఆమె కళ్ళను దానం చేశాడు. 83 ఏళ్ల తండ్రి చనిపోయినప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగించారు. తమ కుటుంబంతోనే అది ఆగిపోకూడదని ఊరంతటికి వ్యాపించాలని సంకల్పించారు. అలా గ్రామస్తులతో సమావేశమై ఒక మనిషి రెండు కళ్ళను దానం చేస్తే మరో ఇద్దరికి చూపు వస్తుందని అవగాహన కల్పించారు. దీంతో ఆ ఊర్లో నేత్రదాన ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
తాను చేసిన మంచి పనిపై ఊరందరికీ అవగాహన కల్పించేందుకు రవీందర్ కొంతమందిని ప్రోత్సహించారు. ఆ స్ఫూర్తితో ముచ్చర్లకు చెందిన సుజాత రాజమణి స్వప్న రాణి కళ్యాణి నేత్రదానంపై విస్తృతంగా పనిచేస్తున్నారు. ఈ ఊర్లోనే కాక ఇరుగుపొరుగు గ్రామాల్లో బంధువులు స్నేహితులు మృతి చెందిన నేత్రదానం చేయాలని కోరుతున్నారు. ముచ్చర్లలో వీరితోపాటు 74 ఏళ్ల వృద్ధుడు మల్లారెడ్డి ఐదు కుటుంబాల వారితో నేత్రదానం చేయించాడు. ఇలా గ్రామంలో అనేకమంది నేత్రదానంపై స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో మొదటగా తన తమ్ముడు రవీందర్ సహకారంతో తమ తల్లి తండ్రుల నేత్రాలను దానం చేశామని.. అంతటితో ఆగకుండా తన తమ్ముడు తమకు కూడా నేత్ర దానంపై అవగాహన కల్పించి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారని గ్రామానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ సాంబయ్య వెల్లడించారు.
Also Read
- Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
Read Also:YS Sharmila: కేసీఆర్ ఒక గజదొంగ.. దమ్ముంటే అరెస్ట్ చేయండి
గ్రామంలో ఎవరైనా చనిపోయినట్టు తెలియగానే నేత్రదానం చేయాలని ఒక బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందని.. కొందరు బాగానే స్పందిస్తున్నా.. కొందరు మాత్రం ఒప్పుకోవడం లేదని.. అయినా తాము మృతదేహం వద్ద రెండు గంటలపాటు ఉండి నేత్రదానం ప్రాధాన్యాన్ని ఓపిగ్గా వివరించి నేత్ర దానం చేసేలా చేస్తున్నామని గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ వివరించారు. మొదటగా తమ ఇంట్లోనుండి తమ నేత్ర దానం చేయించమని.. బంధువుల్లో ఎక్కడా ఎవరు చనిపోయినా వారిని ఒప్పించి నేత్ర దానం చేసేలా చూస్తున్నమని మరో మహిళ రాజమణి చెప్పారు. తాము ఏదైనా మృతదేహం వద్దకు వెళ్లిన అక్కడి వారు నేత్ర దానం కోసం వచ్చారా అని ఇబ్బందికరంగా అడుగుతారని అయినా బాధ పడకుండా నేత్ర దానం ప్రాముఖ్యత వారికి వివరించి నేత్ర దానం చేయిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!