YS Sharmila: కేసీఆర్ ఒక గజదొంగ.. దమ్ముంటే అరెస్ట్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Shocking Comments On CM KCR: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. షాద్నగర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ప్రసంగించిన ఆమె.. కేసీఆర్ ఒక గజ దొంగ అంటూ విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ చేస్తోంది మోసమేనని, తెలంగాణలో ఆయన చేతిలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఆయన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు షాద్నగర్కి ఎంతో చేశారన్నారు. వైఎస్సార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరా క్రాంతి గేదెల పథకం ఈ నియోజక వర్గం నుంచే ప్రారంభించారన్నారు. అంతేకాదు.. ఇంటర్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేయించడంతో పాటు మంచి నీటి సౌకర్యాలు, పార్కులు ఏర్పాటు చేయించారన్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాన్ని ఈ నియోజక వర్గంలోనే వైఎస్సార్ ఏర్పాటు చేయించారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఇక్కడున్న మార్కెట్ యార్డ్కి వైఎస్సార్ వచ్చి, ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారన్నారు. షాద్ నగర్కి వైఎస్సార్ ఎంతో చేస్తే, కేసీఆర్ మాత్రం మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపణలు చేశారు.
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేస్తామని చెప్పి.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని మరి పూర్తి చేస్తానని చెప్పి, చేయలేదన్నారు. షాద్ నగర్ ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. 8 ఏళ్లయినా.. రిజర్వేషన్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. షాద్ నగర్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు కాయలు ఆరు పువ్వులు అన్నట్టు దందాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అంజయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్ అంటూ సెటైర్లు వేసిన షర్మిల.. ఆయన ఆగడాలకు ఒక వ్యక్తి సెల్ఫి వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే కాకముందు అప్పుల్లో ఉన్న అంజయ్య యాదవ్.. ఇప్పుడు వేల ఎకరాలు, వేలకోట్ల ఆస్తుల్ని సంపాదించారన్నారు. అగ్గువకు భూములు గుంజుకోవడం, ఎక్కువకు అమ్ముకోవడం మాత్రమే ఈ ఎమ్మెల్యే కొడుకులకు తెలుసన్నారు. ఈ తండ్రికొడుకుల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని, వారికి ఉసూరు తగలక మానదని శాపం పెట్టారు. షాద్ నగర్లో పరిశ్రమలు ఉన్నా, స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కనీసం డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం చూపలేక పోయారన్నారు. ఈ ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు.. తనపై కేసులు పెట్టారన్నారు. వాళ్లు భూ కబ్జాలు చేస్తే తప్పు లేదు కానీ, తాను మాట్లాడితే మాత్రం తప్పు అంటున్నారన్నారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ఒక మంత్రి తనని మరదలు అంటే తప్పు లేదు గానీ, తాను ఎవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. స్పీకర్ కూడా అందుకు సానుకూలంగా స్పందించడం బాధాకరమన్నారు. తనపై కేసులు పెట్టి అసెంబ్లీకి పిలుస్తారన్నారని, తాను కాలినడకన రావడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ తీసుకోమంటారా? అంటూ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ లోపలైనా, అసెంబ్లీ బయట అయినా తాను పబ్లిక్గా మాట్లాడుతానని.. ఏమడుగుతారో అడగండని సవాల్ విసిరారు. మీ అవినీతిచ అక్రమాలు, దౌర్జన్యాల గురించి మాట్లాడుతానన్నారు. తాను పులి బిడ్డనని, ఎవరికీ భయపడే రకం కాదని చెప్పారు. నిరంజన్ రెడ్డికి తల్లికి, చెల్లికి తేడా తెలియదని, మరదలంటే ఏ మహిళా అయినా చెప్పుతో కొడుతుందని మండిపడ్డారు. తాను నిరంజన్ రెడ్డిపై కేసు పెడితే పట్టించుకోలేదని, కానీ ఆయన ఫిర్యాదు చేస్తే మాత్రం తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆగ్రహించారు. ఎలాగూ తన మీద కేసు పెట్టారు కాబట్టి.. తనని అరెస్ట్ చేయాల్సిందిగా తాను కేసీఆర్కి సవాల్ విసురుతున్నానని అన్నారు. తాను వైఎస్సార్ బిడ్డనని, మీ కేసులకు, బెదిరింపులకు భయపడనని తెగేసి చెప్పారు. తాను ప్రజల పక్షాణ నిలబడి, సేవ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
ప్రజలు తనకు అవకాశం ఇచ్చిన రోజు.. నమ్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో సేవ చేస్తానని షర్మిల పేర్కొన్నారు. అవకాశం ఇచ్చేదాకా ప్రజల కోసమే పోరాటం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి బిడ్డ అయిన తనే ఫిర్యాదే పట్టించుకోలేదంటే, ఇక సాధారణ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీస్లను కేసీఆర్ తన పనోళ్లుగా మార్చుకున్నారన్నారు. బీజేపీకి RSS ఎలాగో.. కేసీఆర్కి ఈ పోలీసులు అలా తయారయ్యారన్నారు. ఈ పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్యం మంత్రి అని, మద్యం అమ్మకాలు పెరిగి మహిళలపై దాడులు పెరుగుతుంటే చర్యలు తీసుకోవడం లేదన్నారు. దక్షిణ భారత్లో మహిళలపై రేపులు జరగడంలో తెలంగాణ నం.1 ప్లేస్లో ఉందన్నారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పేర్కొన్న షర్మిల.. తాను అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్సార్ అమలు చేసిన ప్రతీ పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..