బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి సొంతపార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బ్రతికించానని.. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాను? అని స్పష్టం చేశారు.
read more : ‘తెలంగాణ దేవుడు’కు హోం మంత్రి ప్రశంసలు
సమావేశానికి వెళ్ళాను కాబట్టే దళితుల సమస్యలపై మాట్లాడగలిగానని.. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత ఎన్పవర్మెంట్ సమావేశం చారిత్రాత్మకమైనదన్నారు. వ్యాపారాల కోసం పార్టీల మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేను దగ్గర వ్వలేదు.. దూరమూ జరగలేదని వెల్లడించారు. స్వలాభం కోసం పార్టీలు మారనని… నేను బీజేపీలోనే ఉన్నాను.. ఉంటాను అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ప్రశ్నిస్తా అని తెలిపారు. బీజేపీ పార్టీ వ్యక్తిగానే అఖిల పక్ష సమావేశానికి వెళ్ళానని.. పార్టీ చర్య తీసుకుంటానని అంటే అప్పుడు చూద్దామని తెలిపారు.