బీజేపీ లో ముసలం… సొంతపార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి సొంతపార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బ్రతికించానని.. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాను? అని స్పష్టం చేశారు.
read more : ‘తెలంగాణ దేవుడు’కు హోం మంత్రి ప్రశంసలు
Also Read
సమావేశానికి వెళ్ళాను కాబట్టే దళితుల సమస్యలపై మాట్లాడగలిగానని.. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత ఎన్పవర్మెంట్ సమావేశం చారిత్రాత్మకమైనదన్నారు. వ్యాపారాల కోసం పార్టీల మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేను దగ్గర వ్వలేదు.. దూరమూ జరగలేదని వెల్లడించారు. స్వలాభం కోసం పార్టీలు మారనని… నేను బీజేపీలోనే ఉన్నాను.. ఉంటాను అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ప్రశ్నిస్తా అని తెలిపారు. బీజేపీ పార్టీ వ్యక్తిగానే అఖిల పక్ష సమావేశానికి వెళ్ళానని.. పార్టీ చర్య తీసుకుంటానని అంటే అప్పుడు చూద్దామని తెలిపారు.
తాజావార్తలు
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
-
School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!