Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motkupalli Narasimhulu Says He Is Ready To Contest In Next Elections: ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండటానికి తానేమీ సన్యాసిని కానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్ఛితంగా పోటీ చేస్తానని అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. అయితే.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తనపై కేసీఆర్ ఆశీస్సులు కచ్ఛితంగా ఉంటాయన్నారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. గతంలో తనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా.. ఆలేరు ప్రజలు తనని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆలేరు నుండి కేసీఆర్ ఎవరికీ అవకాశం ఇచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ కచ్ఛితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసిన వ్యక్తినని, ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే కాళ్లు ఆగడం లేదని వెల్లడించారు. ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కాగా.. తన పుట్టినరోజు సందర్భంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే.
Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఇదిలావుండగా.. ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కానీ.. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవ్వడంతో.. 2018లో బీఎల్ఎఫ్ తరపున ఇండిపెండెంట్గా పోటీ చేశారు. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ ఆయన్ను పక్కనపెట్టేసింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.
Revanth Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారు
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!