Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motkupalli Narasimhulu Says He Is Ready To Contest In Next Elections: ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండటానికి తానేమీ సన్యాసిని కానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్ఛితంగా పోటీ చేస్తానని అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. అయితే.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తనపై కేసీఆర్ ఆశీస్సులు కచ్ఛితంగా ఉంటాయన్నారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. గతంలో తనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా.. ఆలేరు ప్రజలు తనని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆలేరు నుండి కేసీఆర్ ఎవరికీ అవకాశం ఇచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ కచ్ఛితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసిన వ్యక్తినని, ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే కాళ్లు ఆగడం లేదని వెల్లడించారు. ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కాగా.. తన పుట్టినరోజు సందర్భంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే.
Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఇదిలావుండగా.. ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కానీ.. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవ్వడంతో.. 2018లో బీఎల్ఎఫ్ తరపున ఇండిపెండెంట్గా పోటీ చేశారు. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ ఆయన్ను పక్కనపెట్టేసింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.
Revanth Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారు
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!