Mother Killed Child: చైన్ స్నాచర్ చిన్నారి హత్యకేసులో కొత్త ట్విస్ట్.. మామూలు కథ కాదిది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా లో చైన్ స్నాచింగ్కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని.. తల్లే పాపను హత్య చేసి కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ సీతారాం వెల్లడించారు. తల్లే ఆ చిన్నారిని నీటి సంపులో పడేసి ఏమీ తెలియనట్లు నాటకం ఆడి పోలీసులకు పెడదారి పట్టించేందుకు చూసిందని, అసలు సూత్రధారి చైన్ స్నాచర్ కాదు తల్లి తన కన్న కూతురుని హత్య చేసిందని డీసీపీ సీతారాం తేల్చారు.
read also: Bandi Sanjay Padayatra: నేడు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. హాజరు కానున్న కేంద్రమంత్రులు
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
జనగామ పట్టణమం అంబేడ్కర్ నగర్కు చెందిన నడిగోటు ప్రసన్న, భాస్కర్ దంపతులు నివాసం వుంటున్నారని, వీరి మృతి చెందిన పాపతో సహా మూడేళ్ల బాబు ఉన్నారు. మూడేళ్ల బాబుకు గుండె సంబంధిత జబ్బు రావడంతో కొన్ని రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారని చెప్పారు. అయితే.. పాప తేజస్వినిలోనూ ఎదుగుదల లేక జీవితాంతం మాటలు రావని వైద్యులు తెలపడంతో తల్లి ప్రసన్న మానసింకంగా కుంగిపోయింది. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి తేజస్వినిని నీటి సంపులో వేసి హతమార్చి, కావాలనే గొలుసు దొంగ చంపాడని కేసును తప్పుదోవ పట్టించింది. పోలీసులు చేపట్టిన విచారణలో భాగంగా తల్లి చేసిన తప్పును ఒప్పుకుంది, నిందితురాలిపై శిశు హత్య 302 కేసు నమోదు చేశామని, తల్లి ప్రసన్న నేరాన్ని చేసినట్టు పోలీసుల ఎదుట ఆమె అంగీకరించిందని డీసీపీ సీతారాం పేర్కొన్నారు.
తల్లి ప్రసన్న అల్లిన పిట్ట కథ
జనగామలో చైన్ స్నాచర్లు రేచిపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలే టార్గెట్ గా వారి మోడలోంచి గొలుసులను లాక్కుని పరారవతున్నారు. ఇలాంటి ఘటనే జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కానీ.. చైన్ స్నాచర్ దురాగతానికి చిన్నారి బలైంది. అంబేడ్కర్ నగర్ లోని రోడ్డుపై వెళుతున్న ప్రసన్న అనే మహిళ మెడ నుంచి మంగళసూత్రం దొంగలించేందుకు దుండగడు ప్రయత్నించాడు. దీంతో ఆమె చోరీని అడ్డుకునేందుకు పెనులాటకు దిగింది. ఈ క్రమంలో అతను ఏం ఆలోచించాడో ఏమో గానీ.. మెడలోని చైన్ కోసం ఆమె చేతిలోని చిన్నారిని తీసుకుని పక్కనే వున్న నీటి సంపులో పడేసి వెళ్లి పోయాడు. తల్లి ప్రసన్న సంపులో పడిన పాపను రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, చిన్నారి విగత జీవిగా మిగిలింది. తన మంగళసూత్రం కోసం చూసుకుంటే తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని గుండెలవిసేలా రోదించింది.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!