Hyderabad: అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థులు.. ఎంట్రీ లేదన్న యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు ఓ విద్యార్థిని క్లాసులోకి అనుమతించలేదు. ఈ ఘటన మొయినాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. దీంతో మొయినాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల్ని స్కూల్ లోపలికి అనుమతించకుండా అధికారులు బయటే ఆపివేశారు. ప్రిన్సిపాల్ తీరు నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులను చేస్తున్న ఆందోళనను అడ్డుకున్నారు. అయితే పోలీసులకు తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. మాల ధరిస్తే స్కూల్ లోపలికి ఎందుకు అనుమతించరు అంటూ మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ఇది సరైన పద్దతి కాదని, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి మాల వేసుకున్న పిల్లలను ఇలా రోడ్డుపై నిలబెట్టడం ఎంత వరకు న్యాయమని మండిపడ్డారు.
పిల్లలను స్కూల్ లోపలికి అనుమతించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలి కానీ ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. స్కూల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఇలా ప్రవర్తిస్తే పిల్లలపై మత ప్రభావాలు పడే ఛాన్సస్ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పిల్లలను స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించాలని చెబుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం మాల ధరిస్తే ఎదుటివారు కూడా పవిత్రంగా ఉండాలని, దాని వల్ల అంటు అనేది వుంటుందని తెలిపారు. మహిళా టీచర్లు వస్తారని కావున అయ్యప్ప మాల ధరించిన వారు వస్తే ఇబ్బందిగా ఉంటుందనే అనుమతించలేదని చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Balayya : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య..?
Also Read
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
తాజావార్తలు
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!