మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
Hyderabad Drug Case: మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల కొడుకుల పాత్ర పైన ఈగల్ టీం విచారణ చేస్తోంది. మూడేళ్లుగా కొంత మంది పోలీసుల పుత్రరత్నాలు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది. అయితే 24 మంది ఉన్న ఈ హైప్రొఫైల్ డ్రగ్స్ పార్టీ కేసులో అసలు విషయాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. హైదరాబాద్ డ్రగ్ కేసు.. ఇప్పుడు కొంత మంది పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతోంది. వారి…