Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- బలపడిన దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..
- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది..
- తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు అలర్ట్ చేసింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి నేడు రేపు వర్షాలు పడాతయని వెల్లడించింది. పూర్తిగా నైరుతి రుతుపవనాలు తిరోగమించాయని తెలిపింది. రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాల రాక సమయంలో తీవ్ర ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే 34 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఏపీకి సమీపాన ఉన్న తెలంగాణ జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉంటుండనుంది. దీని ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 73,573 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.1 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్కు 67,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో (312 టీఎంసీలు) 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Tollywood : అనుకున్నట్టుగానే ఆ సినిమాకు ‘A’ సర్టిఫికెట్..
తాజావార్తలు
-
Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
-
BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
-
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
-
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!