Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ఇన్ చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ను తప్పించి పాడి కౌశిక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
నిజానికి హుజూరాబాద్ స్థానం అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి ఈటల రాజేందర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన ఈటల రాజేందర్ 2021లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ను పోటీకి దింపింది. ఆ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఉప ఎన్నికల సమయంలో అదే నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఈసారి ఎలాగైనా హుజూరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ ఎస్ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే ఈటెలను ఢీకొంటారని భావించి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్సీగానే కాకుండా విప్గా కూడా నియమితులయ్యారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
తాజాగా.. నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. అయితే గతంలో పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా సూచనలు చేశారు. ఇటీవల జమ్మికుంటలో జరిగిన ఓ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఇక నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని కౌశిక్ రెడ్డికి సూచించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని సూచించారు. అయితే.. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో అసంతృప్తిని కలిగించకుండా శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించారు. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. అయితే ఎన్నికల నాటికి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా? లేక గెల్లు శ్రీనివాస్ కూడా టిక్కెట్టు కోసం పోటీ పడతారా? ఈ ఇద్దరిలో ఎవరూ పోటీ చేసినా ఈటల రాజేందర్ని ఢీ కొట్టే సత్తా వీరిలో ఉందా? మరి వేచి చూడాల్సిందే.
Patnam Mahender Reddy: బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!