Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ఇన్ చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ను తప్పించి పాడి కౌశిక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
నిజానికి హుజూరాబాద్ స్థానం అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి ఈటల రాజేందర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన ఈటల రాజేందర్ 2021లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ను పోటీకి దింపింది. ఆ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఉప ఎన్నికల సమయంలో అదే నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఈసారి ఎలాగైనా హుజూరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ ఎస్ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే ఈటెలను ఢీకొంటారని భావించి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్సీగానే కాకుండా విప్గా కూడా నియమితులయ్యారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తాజాగా.. నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. అయితే గతంలో పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా సూచనలు చేశారు. ఇటీవల జమ్మికుంటలో జరిగిన ఓ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఇక నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని కౌశిక్ రెడ్డికి సూచించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని సూచించారు. అయితే.. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో అసంతృప్తిని కలిగించకుండా శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించారు. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. అయితే ఎన్నికల నాటికి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా? లేక గెల్లు శ్రీనివాస్ కూడా టిక్కెట్టు కోసం పోటీ పడతారా? ఈ ఇద్దరిలో ఎవరూ పోటీ చేసినా ఈటల రాజేందర్ని ఢీ కొట్టే సత్తా వీరిలో ఉందా? మరి వేచి చూడాల్సిందే.
Patnam Mahender Reddy: బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!