కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటాతో ఈ అక్రమ అరెస్టులు దీనికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు జీవన్ రెడ్డి. అభిప్రాయం చట్టబద్ధతకు లోబడి ఉండాలి. అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ దేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితంగా దేశంలో అశాంతి నెలకొల్పే విధంగా మాట్లాడారు.
భారత రత్న రాజీవ్ గాంధీని అవమానించే విధంగా భారత దేశ మహిళలకు అఘోరా పరిచేలా రాహుల్ గాంధీ పుట్టుక పై కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ తరపున అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదులు కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. పోలీసులు తీరుకు మేము నిరసిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్లిప్తతకు నిరసనకు జిల్లా కేంద్రాలలో ఎస్పీ కార్యాలయాలలో నిరసన వ్యక్తం చేయడానికి భవించం కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది కేసీఆర్ మార్కెట్ ప్రజాస్వామ్యం గా నేను భావిస్తున్నా అన్నారు జీవన్ రెడ్డి. ప్రధాన మంత్రి మోడీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.