MLC Jeevan Reddy: బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Comments On Munugodu Elections: మునుగోడు చుట్టూ జరుగుతోన్న రాజకీయ రాజకీయ వ్యవహారాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించాడు. ఈరోజు, రేపు మునుగోడు సీటు తమదేనని అన్నాడు. అక్కడ ఓటు అడిగే హక్కు బీజేపీకి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటునే కించపరిచేలా మోదీ మాట్లాడారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని.. ఆ రెండు పార్టీలు కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు చుట్టూ నడుస్తోన్న వ్యవహారం కూడా ఒక పొలిటికల్ గేమ్ అని అభివర్ణించారు. ఇక రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో ఆయనకే తెలియదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మునుగోడులో తమదే అగ్రస్థానమన్న జీవన్ రెడ్డి.. రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే తేల్చుకోవాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజి సీట్లను బహిరంగ వేలానికి పెడుతున్నారని, తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా, విద్యార్థుల హక్కుల్ని కాల రాస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి అన్నారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్కను ధర్మరాజుగా, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడిగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబును అర్జునుడిగా అభివర్ణించారు. నకులుడు, సహదేవుడు ఎవరో చెప్పని ఆయన.. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడిగా పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!