MLA Sanjay Kumar: ఇదే నా ఆఖరి పోటీ.. మరోసారి ఛాన్స్ ఇవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sanjay Kumar Requests People To Give Him Another Chance: జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇదే తన ఆఖరి పోటీ అని, మరోసారి ఛాన్స్ ఇవ్వాలని జగిత్యాల ప్రజల్ని కోరారు. మరోసారి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, జీవన్రెడ్డిలాగా తాను మాట మార్చనని పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించిన రైతు వేదికగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి తనకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని, మీరందరు ఆశీర్వదిస్తే తిరిగి ఎమ్మేల్యేగా పోటి చేస్తానని తెలిపారు. తన మాట, బాట ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే తన చివరి ఎన్నిక అంటూ జీవన్ రెడ్డి ప్రజల ముందు ప్రకటించి గెలిచారని.. కానీ ఆయన మాట మార్చి తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీరు నన్ను భారి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు.
Indrakaran Reddy: రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్కు కడుపుమంటగా ఉంది
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డినో, అతని కొడుకో, ఇంకెవరో పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని.. మరోసారి తనకు ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని సంజయ్ కుమార్ కోరారు. ఇదే చివరి ఎన్నిక అనే ఆలోచన పంచుకునే వేదిక ఇది కాకపోయినా.. ప్రజల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? నిరంతర ఉచిత విద్యుత్తో పాటు సాగునీరు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? అని ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. మోసకారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఉచిత కరెంట్తో పాటు చెక్ డ్యాం నీళ్లు, కాలువ నీళ్ల పుణ్యమా అని.. తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని.. పంటలు పెరిగాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!