MLA Sanjay Kumar: ఇదే నా ఆఖరి పోటీ.. మరోసారి ఛాన్స్ ఇవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sanjay Kumar Requests People To Give Him Another Chance: జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇదే తన ఆఖరి పోటీ అని, మరోసారి ఛాన్స్ ఇవ్వాలని జగిత్యాల ప్రజల్ని కోరారు. మరోసారి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, జీవన్రెడ్డిలాగా తాను మాట మార్చనని పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించిన రైతు వేదికగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి తనకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని, మీరందరు ఆశీర్వదిస్తే తిరిగి ఎమ్మేల్యేగా పోటి చేస్తానని తెలిపారు. తన మాట, బాట ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే తన చివరి ఎన్నిక అంటూ జీవన్ రెడ్డి ప్రజల ముందు ప్రకటించి గెలిచారని.. కానీ ఆయన మాట మార్చి తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీరు నన్ను భారి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు.
Indrakaran Reddy: రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్కు కడుపుమంటగా ఉంది
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డినో, అతని కొడుకో, ఇంకెవరో పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని.. మరోసారి తనకు ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని సంజయ్ కుమార్ కోరారు. ఇదే చివరి ఎన్నిక అనే ఆలోచన పంచుకునే వేదిక ఇది కాకపోయినా.. ప్రజల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? నిరంతర ఉచిత విద్యుత్తో పాటు సాగునీరు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? అని ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. మోసకారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఉచిత కరెంట్తో పాటు చెక్ డ్యాం నీళ్లు, కాలువ నీళ్ల పుణ్యమా అని.. తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని.. పంటలు పెరిగాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!