DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commissioner DS Chauhan Pressmeet On Traffic Rules: రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఎల్బీనగర్లోనే సీపీ క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఎమర్జెన్సీ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని, ఇప్పటిదాకా చాలా వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించామని తెలిపారు.
Anantha Sriram: దివంగత వైఎస్సార్ను అవమానపరిచేలా పోస్టులు.. వీడియో రిలీజ్ చేసిన అనంతశ్రీరామ్
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన అధికారులకు క్యాష్ రీవార్డు కూడా అందిస్తున్నామని తెలియజేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఫేక్ నెంబర్ ప్లేట్స్పై ఆరు నెలల్లో 60 వేల వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి విధుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మేతడ్స్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 కోట్లతో ట్రాఫిక్ అధికారులకు ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అందిస్తామన్నారు. ఏసీ హెల్మెట్, ల్యాప్టాప్స్, జంగిల్ షూ, వాటర్ బాటిల్స్, రీప్లెక్టీవ్ జాకెట్స్, ఎల్ఈడి బ్యాటన్స్ వంటి మౌలిక సదుపాయాలను ట్రాఫిక్ పోలీసులకు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan: ఒక్క పోస్టు కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డు.. కానీ?
ఇదే సమయంలో.. మాదక ద్రవ్యాల డ్రైవ్ కొనసాగుతూనే ఉందని డీఎస్ చౌహాన్ వెల్లడించారు. గంజాయి ముఠా సభ్యులలైన ఆరుగురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. వీళ్లు సీడ్స్ మధ్యలో గంజాయి తరలిస్తున్నారని.. మొత్తం 224 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీలేరు నుండి మహారాష్ట్రకు ఈ ముఠా సభ్యులు గంజాయి తరలిస్తున్నారన్నారు. నిందితుల నుండి మూడు కార్లు, 6 మొబైల్స్, 2 ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ట్రాన్స్పోర్టర్ వివేక్ మోహన్ రావుతో పాటు మరో ఐదుగురు అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!