ఓరుగల్లు టీఆర్ఎస్లో జోష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్లో తీన్మార్ మోగిస్తుంది. కారు పార్టీ పుల్ జోష్ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం, సీనియర్ కోటాలో కడియంకు, పార్టీకి అంకితభావం, నిబద్ధతతో పనిచేసినందుకు తక్కెళ్లపల్లికి, ముదిరాజ్ సామాజిక వర్గం దూరం కాకుడదనే కోణంలో బండా ప్రకాష్కు అవకాశం దక్కింది. వాస్త వానికి ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా నుంచి చాలామంది నేతలు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడ్డారు. దాదాపు 10 మంది నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్ మాత్రం అన్ని సమీకరణాల దృష్య్టా వీరి వైపే మొగ్గు చూపారు. దీంతో జిల్లాకు దక్కిన ప్రాధన్యం గురించి చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి సుదీర్ఘకాలంగా తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం, ఎమ్మెల్సీ పదవులకు ఎంపి క ప్రతిపాదన వచ్చిన ప్రతీసారి తక్కెళ్లపల్లి పేరు రావడం వీగిపోవడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి మాత్రం ఉద్యమ సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు పెట్టుకుని పిలిచి మరీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఉద్యమ నేతలను పార్టీలో పట్టించు కోవడం లేదన్న విమర్శలకు తక్కెళ్లపల్లి ఎంపికతో కాస్త చెక్ పెట్టినట్టు అయిందని గులాబీ నేతలు అంటున్నారు.
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వరంగల్లో ఘనంగా నిర్వహించాలని భావించినప్పుడే కేసీఆర్ ప్రత్యేకంగా హైద్రాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఆయనపై ఎలాం టి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో మొదటి నుంచి పార్టీలో ప్రాధా న్యం కల్పిస్తు వస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేయడమే ఇందుకు నిదర్శనం. సిట్టింగ్లకే టిక్కెట్లు అనే ప్రాతిపదికన కేసీఆర్ కట్టుబడి ఉండటంతో స్టేషన్ఘన్పూర్ టిక్కెట్ కడియం ఆశించినా దక్కలేదు. అదే సమయంలో కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీలో ప్రాధాన్యం కల్పించారు. అయితే, మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకున్నా జరగలేదు. తాజాగా కడియంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయ డంపై మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది.
కడియం శ్రీహరి, రవీందర్రావుల పేర్లు ముందునుంచి వినిపించినా బండా ప్రకాష్ ఎంపికకు మాత్రం ముదిరాజ్ సామాజిక కోణంలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతుంది. జిల్లాకే చెందిన మాజీ స్పీకర్ మధుసూదనచారి పేరు చివరివరకు విని పించినా.. అనుహ్యంగా అధినేత బండాప్రకాష్కు అవకాశం కల్పిం చడం గమనార్హం. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండేందుకు, ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు పార్టీ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!