MLA Muthireddy: ప్రత్యర్ధులు నా బిడ్డను నాపై ఉసిగొలిపారు.. ఎలాంటి ఫోర్జరీ జరగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Muthireddy: జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి సొంత కూతురే.. పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని కూతురు తుల్జా భవానీ రెడ్డి కూడా తన తండ్రి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే దీనిపై
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. నా పైన ప్రత్యర్ధులు అనేక అభియోగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి బతుకమ్మ కుంటలో కబ్జా చేశారని అనగా, మా కార్యకర్తలు అక్కడ టెంట్ వేసి మరి కూర్చున్నారు కానీ ఎవరూ రాలేదు. నాపైన మా ముఖ్యమంత్రి కి కూడా ఆరోపణలు చేశారన్నారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా 2014 2018 లో నన్ను ప్రజల వద్దకు పంపించారని తెలిపారు. అందరికి కుటుంబాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Read also: DVV Entertainment: బిల్డప్ ఇస్తే తొక్క తీస్తా… సూపర్ రిప్లై ఇచ్చారు మావా
Also Read
కానీ నా బిడ్డను ప్రత్యర్ధులు నాపై ఈ విధంగా ఉసిగొలిపారు ఈ విధంగా చేయిస్తున్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని అన్నారు. చేర్యాల లో సర్వే. నే0. 1402 లో 1200 గజాలు తన కూతురిపై రిజిస్టర్ చేసి ఉంది, ఉప్పల్ PS పరిధిలో మా బిడ్డపై 125 నుండి 150 గజాల వరకు ఉన్నది ఇందులో ఏలాంటి ఫోర్జరీ జరగలేదని స్పష్టం చేశారు. ఇది కూడా కేవలం నా కుమారుడు దానిపై కిరాయి నామ మాత్రమే నాకు తెలియకుండానే మార్చారని తెలిపారు. ఇందులో ఎలాంటి ఫోర్జరీ ఏమి జరగలేదని అన్నారు. ఆ ఆస్తి తన కూతురి పెరుమీదనే ఉన్నదని తెలిపారు. కిరాయి కూడా మా అమ్మాయికే వెళ్తుందని స్పష్టం చేశారు. నేను ఏ తప్పు చేసిన ప్రజలు శిక్ష వేస్తారని అన్నారు. మా అధినేత మా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని తెలిపారు. మా రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు అనేది మా అధినేతకు తెలుసని అన్నారు. ధర్మ, ధర్మాలు ప్రత్యర్ధులకు వదిలేస్తున్నానని మాట్లాడారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో కలిసి పని చేసానని గుర్తు చేశారు. 2009 నుండి 2014 వరకు 5 సంవత్సరాలు జనగామ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం చేసానని తెలిపారు. జనగామ నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు కోసం అప్పుడు అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. నా పదవి అడ్డుపెట్టుకుని ఏ అధికారిపై దురుసుగా ప్రవర్తించ లేదని స్పష్టం చేశారు.
Vande Bharat: ఏమైంది రా.. ఎందుకురా రాళ్లదాడులు? ఎవరిమీద కోపం
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!