జర్నలిస్టు నుంచి రాజకీయనాయకుడిగా మారి శాసనసభలో అడుగుపెట్టిన క్రాంతి కిరణ్ నిత్యం చురుకుగా వుంటారు. తాజాగా ఆయన కబడ్డీ కబడ్డీ అంటూ గ్రామాల్లో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంతురూ, సింగూర్,బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.
అనంతరం క్రీడా మైదానంలో కబడ్డీ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. కబడ్డీతో పాటు వాలీబాల్ కూడా ఆడారు ఎమ్మెల్యే. గ్రామ యువకులతో కలిసి ఎమ్మెల్యే ఆటలు ఆడడం సరదాగా ఉందని ఎమ్మెల్యే ఆట తీరును చూసిన వారంటున్నారు. గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను పెంపొందించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి దోహదపడుతుందన్నారు.
యువకుల్ని ఆరోగ్యంగా వుంచడమే కాదు కెరీర్ పరంగా వారికి ఈ క్రీడా మైదానాలు ఉపయోగపడతాయన్నారు. క్రీడలు ఆడడం వల్ల యువత ఉల్లాసంగా ఉంటారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలంలో 4 లక్షల రూపాయల వ్యయంతో క్రీడాప్రాంగణాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. ఉత్సాహ వంతులైన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు