KP Vivekananda: గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు.
ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్ కార్యక్రమంపై కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద ఫైర్ అయ్యారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా సహనంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో జరిగింది ప్రజాదర్భార్ కాదని పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టి పొలిటికల్ కామెంట్స్ చేశారని అన్నారు. మర్యాద దక్కడం లేదని గవర్నర్ చేస్తున్న కామెంట్స్ అసత్యం అని ఆయన అన్నారు. మన గౌరవం మనం కాపాడుకోవాలని సూచించారు.
Also Read
గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలోనే కాదు గవర్నర్ వ్యవస్థను పశ్చిమ బెంగాల్లో కూడా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు గవర్నర్ కమలా బేనీవాల్ ఇలాంటి సభలు పెడితే, మోదీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉత్తరం రాసి గవర్నర్ ను తొలగించాలని కోరారని గుర్తు చేశారు.
బీజేపీకి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే చేత కాక ఇలా గవర్నర్ తో రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందని అన్నారు. గవర్నర్ తన గౌరవానని తాను కాపాడుకోలేకపోతున్నారని అన్నారు. గవర్నర్ చేసింది కరెక్ట్ అయితే అన్ని రాష్ట్రాల రాజ్ భనవ్ లో ప్రజా దర్బార్ పెట్టాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8పై రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో