KP Vivekananda: గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు.
ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్ కార్యక్రమంపై కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద ఫైర్ అయ్యారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా సహనంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో జరిగింది ప్రజాదర్భార్ కాదని పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టి పొలిటికల్ కామెంట్స్ చేశారని అన్నారు. మర్యాద దక్కడం లేదని గవర్నర్ చేస్తున్న కామెంట్స్ అసత్యం అని ఆయన అన్నారు. మన గౌరవం మనం కాపాడుకోవాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలోనే కాదు గవర్నర్ వ్యవస్థను పశ్చిమ బెంగాల్లో కూడా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు గవర్నర్ కమలా బేనీవాల్ ఇలాంటి సభలు పెడితే, మోదీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉత్తరం రాసి గవర్నర్ ను తొలగించాలని కోరారని గుర్తు చేశారు.
బీజేపీకి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే చేత కాక ఇలా గవర్నర్ తో రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందని అన్నారు. గవర్నర్ తన గౌరవానని తాను కాపాడుకోలేకపోతున్నారని అన్నారు. గవర్నర్ చేసింది కరెక్ట్ అయితే అన్ని రాష్ట్రాల రాజ్ భనవ్ లో ప్రజా దర్బార్ పెట్టాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8పై రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!