Jagga Reddy: కేసీఆర్, హరీష్రావుకి కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అదేంటి? ప్రతీరోజు అధికార పార్టీని, కొన్నిసార్లు సీఎం కేసీఆర్ను, చాలాసార్లు మంత్రి హరీష్రావును టార్గెట్ చేసే జగ్గారెడ్డి ఉన్నట్టుండి ఇలా కృతజ్ఞతలు తెలిపడం ఏంటి? అనే సందేహం కలగొచ్చు.. విషయం ఏంటంటే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ విషయంలో.. సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సంబంధించిన సమాచారం తనకు ఉందన్న ఆయన.. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ప్రారంభిస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా నాకు చెప్పారని వెల్లడించారు.
Read Also: Amazon: ఇక అమెజాన్ వంతు.. 10 వేల మంది ఉద్యోగులకు ఊస్టింగ్..!
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
2013 కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మెడికల్ కాలేజీపై ప్రత్తిపాదనలు పంపించడం జరిగిందని.. ఆ తర్వాత మెడికల్ కాలేజీ మంజూరు అయ్యింది.. కానీ, దానిని సిద్ధిపేటకి తరలించరాని తెలిపారు జగ్గారెడ్డి.. తర్వాత మెడికల్ కాలేజీ కోసం నేను మూడేళ్లు పోరాటం చేసిన విషయం మీ అందరికి తెలిసిందేనని.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగిందని.. ఏదైమైనా నా మూడేళ్ల ఉద్యమం, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఫలించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, నేను అసెంబ్లీలో మూడుసార్లు మెడికల్ కాలేజీ గురించి అడగడం జరిగిందన్నారు జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్ దానిపై సానుకూలంగా స్పందించారన్న ఆయన.. చెప్పిన్నట్లే కేసీఆర్ డబ్బులు రిలీజ్ చేసి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.. అందుకే సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్, హరీష్రావుకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇక రానున్న రోజులో సంగారెడ్డి ప్రజలు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక చాలా ఆనందంగా ఉంది.. ప్రతిపక్షంలో ఉన్నపుడు పనులు కాకపోతే అడుగుతాం…. అయితే, పనులు అయ్యాయని చెప్తాం అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!