Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆర్ఎస్ విమర్శించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బూచిలా చూపిస్తూ, బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు చేసిందని మండిపడ్డారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుండి నాయకులను తెచ్చిందని ఆరోపించారు.. అమిత్ షా ను ఒక బూచిల చూపిస్తూ బీజేపీ రాజకీయాలు చేయడం సహించారని నేరం అన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కు అసలు తెలంగాణ గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు అని దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా.. గిరిజనులకు 10 రిజర్వేషన్లను అమలు చేస్తామని, వారం రోజుల్లోనే జీవో వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆమోదించినా, లేకున్నా, తాము మాత్రం గిరిజన రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తెగేసి చెప్పారు. సెప్టెంబర్ 17న ఆదివాసీ, బంజారా భవన్లను సీఎం కేసీఆర్ ప్రారంభించి, ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్ను 10శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. ఇన్నిరోజులు కేంద్రానికి మొరపెట్టుకొని, విసిగిపోయామని ఓపిక లేదని వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గిరిజనుల జీవోను గౌరవించి అమలు చేస్తారా? లేకుంటే.. దానిని ఉరి తాడు చేసుకుంటారా? అని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
వావ్.. ఇది చూశారా.. సన్ గ్లాసెస్ కమ్ ఇయర్ఫోన్స్..