Vemula Prashanth Reddy: ముందస్తు ఊసేలేదు.. ఆ అవసరం బీఆర్ఎస్ కు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ లో బీజేపీ నేతలపై మండిపడ్డారు. తాము ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఆ అవసరం బి.ఆర్.ఎస్. కు లేదన్నారు. పూర్తి కాలం అధికారంలో ఉంటాం అనీ, రేవంత్, బండి సంజయ్ కు ఇంకా 9 నెలల కాలం ఉంది …ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోండని సలహా ఇచ్చారు. ఎంపీ అరవింద్ తనను బేవ కూఫ్ అన్నారు, ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞత కు వదిలేస్తున్నా అన్నారు. రాజకీయాల కొసం ఎంపీ అరవింద్ కులమతాల మధ్య, యువత మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
రాజకీయనేతలు ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఉండాలని, మతాల మధ్య చిచ్చుపెట్టడం కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్కు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పార్టీలు,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
పసుపు బోర్డు తీసుకువస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి , రైతులను మోసం చేసిన ఘనత అరవింద్కే దక్కుతుందని’ దుయ్యబట్టారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఇప్పించినట్లుగానే అర్వింద్ కూడా ప్రధాని నుంచి పీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అడిగితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కు సైకిల్ మోటార్ ఉన్న కుటుంబం అర్హులు కారని కేంద్రం సవాలక్ష ఆంక్షలు పెట్టిందని విమర్శించారు.
ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ ఎన్నోరెట్టు మెరుగైందని మంత్రి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 10 వేల మందికి రూ. 40 కోట్లు ఇప్పించానని సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అరవింద్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు మరోసారి అలాంటి పొరపాటు చేయరని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Postmartem Building: నెరవేరని మంత్రి హరీష్ రావు హామీ…నేలమీద డెడ్ బాడీలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!