బల్కం పేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి: తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తరుచుగా వాహనాల పార్కింగ్ లేకవపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడి సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో బల్కంపేట ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 1161 గజాల విస్తీర్ణంలో జీ3 అంతస్తుల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ను నిర్మించనున్నట్టు తెలిపారు. 40 నాలుగు చక్రాల వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే మొదటి, రెండోవ అంతస్తులో 24 షాపులు భక్తుల కోసం 9 గదులు ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ భవన నిర్మాణ పనులను మరో ఆరునెలల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Read Also:ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారు: షర్మిళ
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
మొత్తం 1161 గజా స్థలంలో 638 గజాల స్థలం ఆలయానికి సంబంధించినది కాగా, మరో 523 గజాలు జీహెచ్ఎంసీకి చెందిన ఈ స్థలాన్ని దేవాదాయ శాఖకు బదీలీ చేసినట్టు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.6లక్షలతో చేపట్టనున్న బోర్ వెల్ పనులను కూడా ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆలయం లోపల, బయట నూతన క్యూలైన్ల ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారి దర్శనానికి ప్రతి మంగళవారం, ఆదివారం భక్తులను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!