Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అధికారులు భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. గర్భగుడిలో సేవలను నేడు, రేపు (డిసెంబర్ 18) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు కొనసాగనుంది. భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతర పూర్తయ్యే వరకు ఆది, సోమవారాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో సమ్మక్క సారలమ్మ భక్తుల సంఖ్య తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం, అన్నపూజలు చేసుకునేందుకు టిక్కెట్లు ఇస్తామని తెలిపారు.
Read also: Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆర్జిత సేవల వివరాలను దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తామని ఈవో వెల్లడించారు.బేడా మండపంలోని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అధ్యయనోత్సవం నిర్వహించారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. స్వామి నేడు వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. ధనుర్మాసంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుప్రభాతం, ఆరాధన, అభిషేకం, తిరుప్పావై సేవ ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.
Jeevan Reddy: ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుంది.. హరీష్ రావుపై జీవన్ రెడ్డి వ్యంగాస్త్రం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!