Warangal: ప్రజాపాలనపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయంత తెలిసిందే. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామసభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఇప్పటికే.. అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తాజాగా ఈ ప్రజాపాలన ఎలా కొనసాగుతుంతో తెలుసుకునేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ.. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: Sunburn Event Cancel: హైదరాబాద్లో సన్బర్న్ ఈవెంట్ రద్దు.. నిర్వాహకుడు సుశాంత్పై కేసు
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- Off The Record : బడే భాయ్ తో యుద్ధానికి తెలంగాణ సీఎం సిద్ధం..?
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘28 నుండి 7వ తేదీ వరకు గ్రామ సభలు పెట్టబోతున్నాము. ప్రజల నుండి అర్జీలను తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మంత్రులు వారి వారి శాఖలపైనా కనీసం సమీక్ష సమావేశాలు పెట్టుకునే అవకాశం లేదు. ఆ కుటుంబం నుండి ఆదేశాలు ఉంటేనే మంత్రులు సమావేశం పెట్టుకున్న దుస్థితి ఉంది. ఆ తీరు ఇప్పుడు లేదు. 28 నుండి 6 వరకు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటాం. కొత్త ప్రభుత్వం వచ్చినా తరువాత అధికారులు స్వచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. రెక్కలు వచ్చినా కొత్త పక్షులు ఎలా స్వచ్ఛగా ఎగురుతాయో అధికారులు స్వచ్ఛగా వారి ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితోనే ఉంది. ఇచ్చిన హామీలను అధిస్తాం.
ప్రజా పాలన అందించేందుకు గత ప్రభుత్వం లాగా రెండు రోజుల పాటు దరఖాస్తులు తీసుకొని తర్వాత సమయం అయిపోయింది అనే తీరు ఈ ప్రభుత్వంది కాదు.
ఈ ప్రభుత్వం అధికారులే వచ్చి మీ దరఖాస్తులు తీసుకుంటారు. ఈ వారం రోజులే కాదు.. మిగిలిన రోజుల్లో కూడా మీ దరఖాస్తులు తీసుకుంటారు. మొన్న అసెంబ్లీలో అంత సమయం ఇస్తే ఏమి చెప్పే లేదు. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు అందులో ఆస్తులు సంపాదించామని చెబుతున్నారు. ఒకటి కూలిపోయిన మేడిగడ్డ.. మంచిగా ఉన్న రాజ్భవన్ లాంటి సెక్రటేరేట్ను కట్టారు. వరంగల్లో మంచి కలెక్టరేట్ ఉండేది.. అది కూల్చి ఇది కట్టారు. కానీ పేదలకు ఉండేందుకు గూడు ఇవ్వలేదు. కావాల్సినంత సమయం ఇచ్చిన అసెంబ్లీలో చెప్పుకోవచ్చు కదా అయిన ఇంటి దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!