Ex MLA Son Case: మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించి మరోకరిపై కేసు.. బయటపడుతున్న పంజాగుట్ట పోలీసుల నిర్వాకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు మలుపు తీరుగుతున్నాయి. నిన్నిటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహైల్ స్థానంలోకి మాజీ ఎమ్మెల్యే పని మనిషి వచ్చాడు. ఈ కేసు నుంచి సోహైల్ను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంజాగుట్ట పోలీసులు కుట్ర పన్నినట్టుగా విచారణలో వెల్లడైంది. కాగా గత ఆదివారం అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఆ సమయంలో సోహైల్ మద్యం తాగి కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అరెస్ట్ అయిన కొడుకు కోసం మాజీ ఎమ్మెల్యే షకిల్ రాత్రి పంజాగుట్ట పోలీసు స్టేషన్కు రావడంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయంగా మలుపు తిరిగింది. షకిల్ స్టేషన్ వచ్చి వెళ్లిన అనంతరం ఈ కేసులో సోహైల్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషిని పోలీసులు కేసులో నిందితుడిగా చేర్చారు. దీంతో ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సోహైల్ అరెస్ట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్కు వచ్చి వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయింది.
Also Read: Law Student Arrest: మాజీ ప్రియుడిపై పగ.. కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన లా స్టూడెంట్
దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు జరగుుతన్న క్రమంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థకు గురైనట్టు సమాచారం. బీపీ పెరిగిపోవడంతో అధికారులు ఆయనను ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. సోహైల్తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా గతంలోనూ సోహైల్ను ఓ రోడ్డు ప్రమాదం కేసులో తప్పించినట్టు విచారణలో తేలింది. రోడ్ నెం 45లో సోహైల్ రోడ్డు ప్రమాదం చేయగా.. ఈ ఘటన ఇద్దరు చనిపోగా..మరొకరు ఇప్పటికీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదంలో కూడా మాజీ ఎమ్మెల్యే తన కొడుకు సొహెల్ తప్పించి మరొకరిని కేసులో చేర్చారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!