Bansilalpet Step Well: మెట్ల బావిని ప్రారంభించిన కేటీఆర్.. నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా..
Minister KTR Started Bansilalpet Step Well: శతాబ్దాల చరిత్రల కలిగిన బన్సీలాల్పేట్ మెట్ల బావిని మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. గతేడాది నుంచి పునరుద్ధరణ పనులు జరుపుకుంటోన్న ఈ బావి.. ఇప్పుడు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. సహిత అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. జీహెచ్ఎంసీ ఈ బావిని నాటి వైభవం కళ్లకు కట్టేలా పునరుద్ధరించింది. చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను జీహెచ్ఎంసీ గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి, ఎన్నో మరమ్మత్తులు చేపట్టింది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు పనులన్నీ పూర్తైన నేపథ్యంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కేటీఆర్ ఈ మెట్ల బావిని ప్రారంభించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, వ్యర్థాలను తొలగిస్తున్నప్పుడు లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీతో పాటు పచ్చదనంతో కూడిన గార్డెన్ను ఈ బావిలో ఏర్పాటు చేశారు.
కాగా.. ఈ మెట్ల బావిని మూడు శతాబ్దాల క్రితం సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం అసఫ్-జాహీ వంశస్తులు నిర్మించారు. ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో ఈ బావిని ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. కాలక్రమంలో ఈ బావి పాడైపోవడంతో.. ఆంగ్లేయుల కాలంలో 1933లో నాటి సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ దీనిని పునరుద్ధరించారు. 1970 వరకూ ఈ బావి బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఇది నిరాదరణకు గురైంది. దీనిని చెత్త వేడానికి జనాలు వినియోగించారు. అలా చెత్త వేయడంతో, అది పూడుకుపోయింది. గతేడాదిలో ఈ బావిని గుర్తించి, 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి పునరుద్ధన పనులు మొదలుపెట్టారు. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి, కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న ఈ బావి లోపల నుంచే ఒక నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని గుర్తించారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతోంది.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!