Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు… కొనసాగుతున్న స్కీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు… కొనసాగుతున్న స్కీమ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం నవంబర్ 29, 2013 న కేసీఅర్ ఆమరణ దీక్ష కు దిగారని గుర్తు చేశారు. కేసీఅర్ పోరాటంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. గత 14 ఏళ్లుగా నవంబర్ 29 న దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తుందన్నారు. ఈ సారి దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించుకోవలని పార్టీ శ్రేణులను కోరుతున్నామని అన్నారు. నవంబర్ 29 ఎక్కడి వారు అక్కడ తోచిన విధంగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ నిర్వహణ కొనసాగుతుందని అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్ అవుట్ అయిన పార్టీ… ఎంత వాగిన లాభం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మా నేతల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీఎం కిసాన్ వేసినప్పుడు రేవంత్ ఎందుకు మాట్లాడారు ? అని ప్రశ్నించారు. రైతు బంధు కొత్త స్కీమ్ కాదు …కొనసాగుతున్న స్కీమ్ ఇది అని స్పష్టం చేశారు. రేవంత్ 3 గంటలు… డీకె శివ కుమార్ 5 గంటలు కరెంట్ అంటున్నారన్నారు. కానీ మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్నాం అని గుర్తు చేశారు. కర్ణాటక వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముతాం అంటే…. వారి అవగాహన అన్నారు. గోషామహల్ లో కూడా బీజేపీని ఓడిస్తాం అన్నారు. నాకు వచ్చిన ఈసీ నోటీస్ లకు బదులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Kishan Reddy: ఇది నాల్గవది అయినా స్పందించరా.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్ను వినియోగిస్తున్నారని, టీ-వర్క్స్లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారంటూ ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘించినందుకు తనపై చర్యలు తీసుకోవాలని రణదీప్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్ సెంటర్ను రాజకీయ కార్యక్రమానికి ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కేటీఆర్పై మండిపడుతున్నాయి…అలా చేసిన తర్వాత అన్ని విషయాలపై విచారణ ఈసీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ప్రైమరీ ఎన్నికల నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించారు. మరి కేటీఆర్ ఇచ్చిన వివరణతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా.. లేక కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది.
Kishan Reddy: ఇది నాల్గవది అయినా స్పందించరా.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!