Telangana Elections 2023: తెలంగాణలో అగ్ర నేతల పర్యటన.. జన సమీకరణకు పార్టీల భారీ ఆఫర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: ఉమ్మడి మెదక్ జిల్లాలో అగ్రనేతల పర్యటనలకు పార్టీలు బెదిరిస్తున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకేరోజు బహిరంగ సభలు నిర్వహించారు. ఇది పార్టీ కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. మోడీ సభ గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సీఎం కేసీఆర్ సభ దుబ్బాక, మంత్రి కేటీఆర్ సభ నర్సాపూర్, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ప్రచార సభ మూడు చోట్ల ఉండడంతో సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంత ఓటర్లకు పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. తమ పార్టీల అగ్రనేతల సమావేశానికి వస్తే వెయ్యి రూపాయలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి మరింత మందిని సిద్ధం చేస్తున్నారు.
నేడు నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ, జనసేన అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు. బీజేపీ నేత నిర్మల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా నిర్మల్తోపాటు సభా ప్రాంగణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
సభా ప్రాంగణాన్ని పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ కూడా ఖాన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా ఖానాపూర్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 గంటలకు ఖానాపూర్ చేరుకోనున్న కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్కు మద్దతుగా ప్రసంగిస్తారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సాపూర్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఈరోజు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మూడు చోట్ల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అందోల్లో ఎన్నికల ప్రచారం. రాహుల్ మధ్యాహ్నం 2.30 గంటలకు సంగారెడ్డి, 4.15 గంటలకు కామారెడ్డికి వెళతారు.
ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈరోజు (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఖానాపూర్లో సీఎం కేసీఆర్, మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనతో జిల్లాలో ఎన్నికల ప్రచారం జరగనుంది. మూడు చోట్ల ఏఐసీసీ అధ్య క్షుడు రాహుల్ గాంధీ ఎన్నిక ల స మావేశాలు మ రింత ప్ర భావం చూప నున్నాయ ట ! పోలీసు అధికారులు అసెంబ్లీ ప్రాంగణాన్ని తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?