పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్ గా మారిందని అవకాశౄలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బందును పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వాన్ని నుడుపుతన్న జోబైడెన్ కావొచ్చు.. దేశాన్ని నడుపుతున్న ప్రధాని మోడీ కావొచ్చు.. రాష్ట్రాన్ని నడుపుతున్న సీఎం కేసీఆర్ కావొచ్చు అందరి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఉపాధి కల్పన, నిరుద్యోగం అని కేటీఆర్ అన్నారు.
అయితే.. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు చదువుకొన్ని విద్యావంతులు అవుతుననారని, వారి విద్యకు, ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన పరిమితంగానే ఉంటుందని తెలిపారు. మిగతా వారు స్వయం ఉపాధి అవకాశాల వైపు వెళ్లాలని, పారిశ్రామిక వేత్తలుగా మారాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపిందించి అమలు చేసిందన్నారు. పరిశ్రమల స్థాపించే వారికోసం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. అంతేకాకుండా.. మనిషి పుట్టించిన కులం.. మతం ఆధారంగా మనల్ని మనం విభజించుకొని జీవనం గడుపుతున్నాం. ఇవి మనం చేసుకున్న కార్యక్రమాలను.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మారాయని డిక్కీ ప్రతినిధులు చెప్తుంటే ఆనందం వేసిందన్నారు.