Minister KTR : దేశంలోనే మొదటి MRO సెంటర్.. చాలాసంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్లో నేడు సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫెసిలిటీ సెంటర్ లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఈ ఫెసిలిటీ ఏర్పాటు కోసం 2018 నుంచి పలుసార్లు సాఫ్రాన్ తో చర్చలు జరిపామని ఆయన వెల్లడించారు. ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో 8 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిందని, 250 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. అయితే.. ఇప్పుడు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం దాదాపు 1200 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేసిందని, 1000 మందికి ఉద్యోగవకాశాలు రానున్నాయని ఆయన తెలిపారు. దేశంలోనే మొదటి MRO సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం చాలాసంతోషమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
బెంగుళూరు, చెన్నై లలో ఏర్పాటు చేయబోయే మరో సెంటర్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని సాఫ్రాన్ సీఈవో ని కోరుతున్నానన్నారు. అందుకు కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తామని, ఈ ఫెసిలిటీ సెంటర్ ని భారత్ తో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉపయోగించుకొనున్నాయని ఆయన తెలిపారు. సాఫ్రాన్ డిజిటల్ ట్రన్స్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వనుందని, ఏవియేషన్ అండ్ డిఫెన్స్ లలో పెట్టుబడులకి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. తెలంగాణలో ఎరోస్పేస్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
-
CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!